Friday, April 19, 2024

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..

గోషామహల్ బీజేపీ ఎమెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. హనుమాన్ ర్యాలీ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్… గౌలిగూడలో పోలీసులు రాజాసింగ్ ను అరెస్టు చేశారు. నవమి శోభాయాత్రలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేశారని రాజా సింగ్‌పై కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా ఆయన్ని అరెస్టు చేశారు. ఐతే… రాజాసింగ్ ఇవాళ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.


తన అరెస్టుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ భక్తులు విధ్వంసం సృష్టిస్తే తనకు సంబంధం లేదన్నారు రాజా సింగ్. “ఇవాళ హనుమాన్ జయంతి. ఏటా హనుమాన్ జయంతి నాడు నా నియోజకవర్గంలో బైక్ ర్యాలీ జరుగుతుంది. నాలాంటి వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారు. నన్ను అరెస్టు చేస్తే.. ఆంజనేయ భక్తులు రెచ్చిపోతే.. దానికి నేను బాధ్యుణ్ని కాదు. దానికి పోలీసులు, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రే బాధ్యులు” అని రాజా సింగ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement