Tuesday, March 26, 2024

రైతుల‌ను క‌డ‌తేర్చే పార్టీ బీజేపీ.. క‌డుపులో పెట్టుకునే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ క‌విత‌

రైతుల‌ను క‌డ‌తేర్చే పార్టీ బీజేపీ అని, రైతుల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకునే పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు న‌ల్ల‌చ‌ట్టాల పేరుతో రైతుల‌కు తీర‌ని అన్యాయం చేసింద‌ని, 700కు పైగా రైతుల చావుకు కార‌ణ‌మైంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ మేర‌కు ఆదివారం ఆమె ఒక ట్వీట్ చేశారు. బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు రైతులను జీపుతో తొక్కించి చంపినా స్పందించని సంస్కృతి కాషాయ పార్టీద‌ని క‌విత విమ‌ర్శించారు. దేశానికి వెన్నెముక అయిన రైతును క‌డుపులో పెట్టిచూసుకునే సంస్కృతి సీఎం కేసీఆర్‌ద‌ని పేర్కొన్నారు. న‌ల్ల‌చ‌ట్టాల‌పై పోరులో అమ‌రులైన రైతుల కుటుంబాల‌కు సీఎం కేసీఆర్ ఛండీగఢ్‌లో చెక్కులు పంపిణీ చేస్తున్న ఫొటోల‌ను ఈ సంద‌ర్బంగా క‌విత షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement