Tuesday, April 16, 2024

బీజేపీ దేనికీ భ‌య‌ప‌డ‌దు.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

బీజేపీ దేనికి భయపడదని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో రాజకీయ సంక్షోభం తీసుకురావాలని చూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సరైన సమయంలో ఎన్నికలు జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రకారం నడుచుకునే పార్టీ తమదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై తమకు విశ్వాసం ఉందని చెప్పారు. ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తామన్న ఆయన అసెంబ్లీ ఎన్నికలపై తమకు తొందర లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం అభద్రతా భావంలో ఉందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement