Thursday, April 18, 2024

Breaking: వ‌రంగ‌ల్ జిల్లాలో బైక్ యాక్సిడెంట్‌.. చ‌నిపోయిన ములుగు ఆస్ప‌త్రి డాక్ట‌ర్‌

చెన్నారావుపేట, (ప్రభ న్యూస్): వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ప్ర‌మాదం జ‌రిగింది. రామన్నకుంట తండా శివారులో జరిగిన యాక్సిడెంట్‌లో ప్రభుత్వ డాక్ట‌ర్ చ‌నిపోయారు. ఎస్ఐ. తోట మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణం ఇంద్రానగర్ కి చెందిన కుదురుపాక రాజు (28) ములుగు ప్రభుత్వ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్‌గా పనిచేస్తున్నారు.

కాగా, బైక్ పై నెక్కొండలో జరిగిన వివాహానికి వెళ్లి తిరిగి నర్సంపేటకు వస్తుండగా రామన్నకుంట తండా శివారులో ప్ర‌మాదం జ‌రిగింది. త‌ను వ‌స్తున్న బైక్‌కి అడ్డంగా ఎద్దు రావడంతో బండి అదుపుతప్పింది. అంత‌లోనే ఎద్దుకు తగలడంతో రాజు తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే చ‌నిపోయాడు. ఈ ప్ర‌మాదంతో ఎద్దు కూడా చ‌నిపోయింద‌ని ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement