Thursday, April 25, 2024

మద్యం మత్తులో డివైడర్ ను ఢీకొట్టిన యువకుడు

హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువయిపోతున్నాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్ధరాత్రి పీవీ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్  పిల్లర్ నెంబర్ 170 ఉప్పరపల్లి వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు డివైటర్ ను ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయం అవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఆరంఘర్ నుంచి మెహిదీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement