Saturday, April 20, 2024

బ్యూటీ ఆఫ్‌ డెమోక్రసీ.. టీఆర్ ఎస్ గుడ్ జాబ్‌

రైతు సమస్యలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు లోక్‌సభలో నిరసనలు కొనసాగించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో బిజూ జనతాదళ్‌కు చెందిన ప్రమీలా బిసోయి ప్రసూతి ప్రయోజనాల అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు.

అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్ర అగర్వాల్‌, సీనియర్‌ సభ్యురాలికి అవకాశం ఇవ్వాలని తెరాస సభ్యులను అభ్యర్థించారు. దీనికి సానుకూలంగా స్పందించిన తెరాస సభ్యులు వారి నిరసనను కొద్దిసేపు విరమించారు. మహిళా సభ్యురాలు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. తమ డిమాండ్ల కోసం సభను అడ్డుకోవడమే లక్ష్యంగా సభ్యులు వ్యవహరిస్తున్న వేళ, ఓ మహిళా సభ్యురాలి విన్నపాన్ని మన్నించి ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా తెరాస ఎంపీలు ప్రజాస్వామ్య సౌందర్యాన్ని గుబాళింపజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement