Tuesday, April 16, 2024

ప్రివిలేజ్ క‌మిటీ ముందు హాజ‌రుకానున్న బండి సంజ‌య్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ఈరోజు పార్ల‌మెంట్ ప్రివిలేజ్ క‌మిటీ ముందు హాజ‌రుకానున్నారు. ఉద్యోగుల బ‌దిలీ గురించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 317 ను స‌వ‌రించాల‌ని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజ‌య్ డిమాండ్ చేస్తు.. దీక్ష చేశారు. అయితే బండి సంజ‌య్ దీక్ష స‌మ‌యంలో క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని పోలీసులు అరెస్టు చేశారు.
బండి సంజ‌య్ అరెస్టును ఇటు రాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలు ఖండించాయి. అయితే త‌న‌ను అరెస్టు చేసే స‌మ‌యంలో తెలంగాణ పోలీసులు క‌నీస నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని బండి సంజ‌య్ అరోపించారు. అంతే కాకుండా త‌న అరెస్టు వ్యవహారం పై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి కూడా ఆయ‌న ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రోజు ఎంపీ బండి సంజ‌య్ పార్లమెంట్‌ ప్రివిలేజ్ క‌మిటీ ముందు హాజ‌రు కానున్నారు. తెలంగాణ పోలీసులు త‌న‌ను అరెస్టు చేసిన విధానాన్ని పార్ల‌మెంట్ ప్రివిలేజ్ క‌మిటీ తెలియ‌పరుస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement