Thursday, April 25, 2024

ఈటల కోసం రావొద్దుః కార్యకర్తలకు బండి పిలుపు

పాద‌యాత్ర‌లో పాల్గొంటూ అస్వ‌స్థ‌త‌కు గురైన హైదరాబాద్ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఈటల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈటల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నేత‌ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్.. ఈట‌ల‌ను ప‌రామ‌ర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తెలిపారు. కొన్ని టెస్టులు చేసిన తర్వాత పాదయాత్ర కొనసాగిస్తారన్నారు. డాక్టర్లు మూడు రోజులు రెస్ట్ అవసరమని చెప్పినట్లు తెలిపారు. ఈటలను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌కి రావద్దని, కార్యకర్తలందరూ హుజురాబాద్‌లోనే ప్రచారంలో పాల్గొనాలని బండి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement