Friday, March 29, 2024

అక్రమ ప్రాజెక్టులకు కేసీఆరే కారణం: బండి

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను కాపాడుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఘోరంగా విఫలమైయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే కేఆర్ఎంబీ పరిధిని నోటీఫై చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కోరారు.

కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆరే కారణమని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారు అవ్వాలనే 2వ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ను వాయిదా వేయించారని మండపడ్డారు. తెలంగా, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ఏపీ న్యూస్: ఈనెలలోనే 1,328 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement

తాజా వార్తలు

Advertisement