Thursday, March 28, 2024

టిఆర్ఎస్ పార్టీ కి అభ్యర్థి కరువయ్యారు: బండి సంజయ్

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ఆరవ రోజు కొనసాగుతోంది. ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ లో త్వరలో జరిగే ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ కి అభ్యర్థి కరువయ్యారు అని ఎద్దేవా చేశారు. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు సీఎం కేసీఆర్‌ అన్నారు.

ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి సాక్షిగా చెబుతున్నా ఈటల గెలుస్తున్నాడని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్‌ గెలిచిన తరువాత ఇక్కడ దర్శనం చేసుకొని నేరుగా అయోధ్యరామున్ని దర్శించుకుంటానని తెలిపారు. ప్రతి సర్వేలో ఈటల గెలుస్తున్నాడని చెప్పడంతో భయానికి సీఎం కేసీఆర్‌ తెల్లవారు జామున నిద్రపోతున్నాడని పేర్కొన్నారు. ఏ ఎన్నికలోచ్చినా అక్కడికి వచ్చి హామీలివ్వడం కేసీఆర్‌కు అలవాటని, దళితబంధు కూడా కొందరికి ఇచ్చి మోసం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఆయనే దళితబంధుపై కోర్టులో పిటిషన్‌ వేసి రాజేందర్‌ వేయించాడని కూడా ప్రచారం చేస్తాడని చెప్పారు.

ఇది కూడా చదవండి : అయోధ్య నుంచి బరిలోకి యోగీ ఆదిత్యనాథ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement