Friday, April 19, 2024

Bandi Sanjay: కేసీఆర్ పతనం స్టార్.. TRS ప్రభుత్వం ఉంటుందా?

తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. యాసంగిలో తెలంగాణలో పండేదే పార్‌బాయిల్డ్‌ రకం దొడ్డువడ్లు కొనమని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో కేంద్ర తీరుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ పతనం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన జ్యోతిష్యుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందా.. పోతుందా.. గ్యారెంటీ లేదని వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారన్న బండి… బీజేపీపై నెపం నెట్టడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అసలు అపాయింట్మెంట్ లేకుండా కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

తన సొంత పనుల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కష్టపడుతున్నారన్నారు. ఏడేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందని బండి సంజయ్ ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement