Thursday, March 28, 2024

నేటితో ముగియనున్న బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నేటితో ముగియనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో రెండో విడత పాద యాత్రను బండి సంజయ్ ముగింపు పలకనున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 31 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్లకు పైగా బండి సంజయ్ నడిచారు. కాగా, తుక్కుగూడలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement