Friday, April 19, 2024

గవర్నర్ ను కలిసిన బండి బృందం

భైంసా లో ఇటీవల అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై బండి సంజయ్ గవర్నర్ తమిళిసైని కలిశారు. బైంసా ఘటనలో హిందువులను పోలీసులు అరెస్టు చేశారని వెంటనే వాళ్లను విడుదల చేయాలంటూ వినతి పత్రంలో అందచేశారు. హిందువులను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను కోరారు.

రాష్ట్రంలో అలాగే బైంసాలో హిందువులపై జరుగుతున్న దాడులు నిరంకుశ వైఖరిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. ఇక బండి సంజయ్ తో పాటు ఎన్ రాంచందర్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు గవర్నర్ ను కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement