Saturday, April 20, 2024

ఆ రోజే చనిపోయిన ప్రీతి – చికిత్స పేరుతో ప్ర‌భుత్వం డ్రామాః బండి సంజ‌య్….

హైద‌రాబాద్ – కెఎంసి పిజి మెడిక‌ల్ విద్యార్ధిని ప్రీతి ఆత్మ‌హ‌త్య చేసుకున్న రోజునే మ‌ర‌ణించింద‌ని, అయితే ప్ర‌భుత్వం చికిత్స పేరుతో డ్రామాలాడింద‌ని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజ‌య్ ఆరోపించారు.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ​ఆయ‌న ఈ రోజు హైదరాబాద్ లో నిర‌శ‌న దీక్ష చేశారు. ఈ దీక్ష‌లో ఎమ్మెల్యే ఈటెల‌, బిజెపి నేత‌లు కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, విజ‌య‌శాంతి, ఎంవిఎస్ఎస్ ప్ర‌భాక‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా బండి మాట్లాడుతూ, పోలీసులు ముందే స్పందించి ఉంటే.. వైద్య విద్యార్థిని ప్రీతి చనిపోయి ఉండేది కాదని బండి సంజయ్ అన్నారు. వైద్య విద్యార్థిని ప్రీతి మరణానికి ఇప్పటికీ కారణాలు తెలియటం లేదన్న బండి పీజీ మెడికో ఆత్మహత్య చేసుకునేంత పిరికి విద్యార్థిని కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చనిపోయిన ప్రీతికి నాలుగు రోజుల పాటు చికిత్స చేసి నాటకం ఆడారని ఆరోపణలు చేశారు. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా . సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది తమ పార్టీ మాత్రమేనని అన్నారు.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే బుల్ డోజ‌ర్ల‌తో నిందితుల‌కు త‌గిన బుద్ది చెబుతామ‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement