Friday, March 29, 2024

Rangareddy: బర్త్​ డే వేడుకల్లో ఘోరం.. సెల్​ఫోన్​ కొట్టేశాడని కత్తులతో అటాక్​!

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో దారుణం జ‌రిగింది. ఏవీఎస్ రెడ్డి కాల‌నీలో ఓ యువ‌కుడిపై క‌త్తుల‌తో అటాక్​ చేశారు. బ‌ర్త్ డే వేడుక‌ల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిన్నరాత్రి జ‌రిగిన పుట్టినరోజు వేడుక‌ల‌కు రాకేశ్ అనే యువ‌కుడు హాజ‌ర‌య్యాడు. రాకేశ్ సెల్‌ఫోన్‌ను మ‌రో యువ‌కుడు దొంగిలించాడు. త‌న ఫోన్ ఇవ్వ‌మ‌ని అత‌డిని అడిగినందుకు న‌లుగురు యువ‌కులు క‌లిసి రాకేశ్‌పై క‌త్తుల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement