Saturday, April 20, 2024

వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి శిశువు మృతి : న్యాయం చేయాలంటూ ధర్నా, రాస్తారోకో

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల హాస్పిటల్లో శుక్రవారం వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలం జంగేడు గ్రామానికి చెందిన అటకాపురం నరేష్ లావణ్య శుక్రవారం డెలివరీ కాగా హాస్పటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో మగ శిశువు మృతి చెందాడు. బాధితులు జరిగిన సంఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జీడీ తిరుపతిని నిలదీయగా వారు తనకేమీ తెలియదని, తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన బాధితులు, వారి కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంబంధిత వైద్య సిబ్బంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై చర్యలు తీసుకునే వరకు ధర్నా విరమించేదిలేదని భీష్మించుకుని కూర్చున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement