Thursday, April 25, 2024

అయ్య‌ప్ప‌స్వామి మ‌హాప‌డిపూజ‌లో మంత్రి త‌ల‌సాని దంప‌తులు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అయ్యప్పస్వామి మహ పడిపూజ ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఈ పూజ ను ప్రారంభించారు. అయ్యప్పస్వామి పూజను మంత్రి తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ దంపతులు నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, ఏసీబీ డైరెక్టర్ అంజనీ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement