Saturday, April 20, 2024

మేయర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఆటో కార్మికులు


బాచుపల్లి : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వచ్ఛ సేవా సమితి పారిశుధ్య, ఆటో రిక్షా కార్మికులు మేయర్ నీలా గోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛ సేవా సమితి సంఘ కార్మికులు మర్యాద పూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ కు రాష్ట్రపతి అవార్డు దక్కడంపై మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డిని కలిసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కార్మికులు వారి సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వచ్ఛ సేవా సమితి కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement