Wednesday, April 24, 2024

ఆవును తప్పించబోయి ఆటో బోల్తా – మహిళ మృతి…

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి .. హఠాత్తుగా ఆవు దూడ రోడ్డుకి అడ్డంగా రావడంతో అటుగా వస్తున్న ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న మహిళ పద్మ (39) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన బాధితుల కథనం మేరకు సోమవారం జిల్లా కేంద్రం వైపు వస్తున్న ఆటోకు అడ్డంగా ఆవు పరిగెత్తుకుని రావడంతో దాన్ని తప్పించబోయిన ఆటో బోల్తా పడి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతిచెందిన మహిళ తెలకపల్లి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిందిగా సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న మరి కొంతమంది గాయాలై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement