Wednesday, April 24, 2024

Breaking: పేకాట స్థావరంపై దాడి – ఆరుగురు అరెస్ట్

ఖమ్మం బ్యూరో (ప్ర‌భ న్యూస్‌) : ఖమ్మం జిల్లా వైరా బ్రిడ్జి పక్కనగల పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. సీక్రెట్ గా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుండి నాలుగు సెల్ఫోన్లు, అయిదు మోటార్ సైకిళ్లు, రూ.2,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement