Thursday, March 28, 2024

పాత‌బ‌స్తీలో దారుణం-బాలిక‌ని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కి పాల్ప‌డ్డ యువ‌కులు

16ఏళ్ల బాలిక‌పై యువ‌కులు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఈ నెల 12న చంచల్‌గూడ జైలు సమీపంలో బాలికను కిడ్నాప్‌ చేసిన యువకులు.. నాంపల్లిలోని ఓయో లాడ్జ్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఆ మైనర్‌ బాలికను అక్కడే వదిలివెళ్లిపోయారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితులు బాధితురాలికి తెలిసినవారేనని పోలీసులు భావిస్తున్నారు.ఈ సంగ‌ట‌న పాతబస్తీలో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement