Tuesday, April 23, 2024

పెద్దపల్లి జిల్లాలో దారుణం.. మైనర్‌ బాలికపై అత్యాచారం

పెద్దపెల్లి, ప్రభన్యూస్‌ : తొమ్మిదేళ్ల మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి లో చోటు-చేసుకుంది . జమ్మికుంట మండలం ఇల్లంతకుంట గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరికి వచ్చింది. గురువారం బాలిక అమ్మమ్మ తాతయ్య ఉపాధి హామీ పనులకు వెళ్లగా ఆడుకునేందుకు పక్కింటి పిల్లలతో ఆడుకునేందుకు వెళ్ళగా శిలారపు రమేష్‌ (30) అత్యాచారానికి పాల్పడ్డాడని బంధువులు పేర్కొన్నారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రమేష్‌ పరారీ కాగా సాంకేతికత ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement