Friday, April 19, 2024

ఆర్టీసీ బ‌స్సు ప్ర‌మాదంపై మంత్రి అజయ్ దిగ్భ్రాంతి

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కల్కొడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. కల్కొడ చౌరస్తా వద్ద ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను మర్పల్లి ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవ‌లు అందేలా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని వికారాబాద్, సంగారెడ్డి రీజినల్ మేనేజర్లను ఆదేశించారు. గాయపడినవారు త్వర‌గా కోలుకోవాల‌ని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement