Friday, April 19, 2024

జిల్లా కోర్టుల పర్యవేక్షణకు న్యాయమూర్తుల నియమాకం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జిల్లా కోర్టుల నిర్వహణను పర్యవేక్షించేందుకు న్యాయమూర్తులను రాష్ట్ర హైకోర్టు నియమించింది. ఈ మేరకు జిల్లా న్యాయమూర్తుల పేర్లను ఖరారు చేసింది.ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ జిల్లా కోర్టుకు జస్టిస్‌ పీ. నవీన్‌రావు, మేడ్చల్‌-మల్కిజిగిరి-డా. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, రంగారెడ్డి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ శివాలి, హన్మకొండ-వరంగల్‌ కోర్టులకు జస్టిస్‌ శ్రీదేవి, ఖమ్మంకు జస్టిస్‌ టీ. వినోద్‌ కుమార్‌, సంగారెడ్డి, మెదక్‌- జస్టిస్‌ ఏ. అభిషేక్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట-జస్టిస్‌ కే. లక్ష్మణ్‌, నాగర్‌కర్నూలు-గద్వాలకు జస్టిస్‌ బి. శఙ్వసేన్‌రెడ్డి నియ‌మితుల‌య్యారు..

నల్గొండ-జస్టిస్‌ లలిత కన్నెగంటి, నిజామాబాద్‌ – జస్టిస్‌ పీ. శ్రీసుధ, కరీంనగర్‌-జస్టిస్‌సీ. సుమలత, కొత్తగూడెం-జస్టిస్‌ జీ. రాధారాణి, పెద్దపల్లి- జస్టిస్‌ ఎం. లక్ష్మణ్‌, నిర్మల్‌, ఆసీఫాబాద్‌ – జస్టిస్‌ ఎన్‌. తుకారాంజీ, మంచిర్యాల-జస్టిస్‌ ఏ. వెంకటేశ్వరరెడ్డి, మహబూబాబాద్‌-జనగామ-జస్టిస్‌ పీ. మాధవీదేవి, సూర్యాపేట-జస్టిస్‌ కే. సురేందర్‌, భువనగిరి-జస్టిస్‌ సూరేపల్లి నంద, సిద్ధిపేట-జస్టిస్‌ ముమ్మినేని సుధీర్‌ కుమార్‌, ఆదిలాబాద్‌-జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి, జగిత్యాల-జస్టిస్‌ ఎన్‌వ. శ్రవణ్‌కుమార్‌, జగిత్యాల-జస్టిస్‌ ఎన్‌వీ. శ్రవణ్‌ కుమార్‌, ములుగు-భూపాలపల్లి.. జస్టిస్‌ జీ. అనుపమ చక్రవర్తి, కామారెడ్డి-జస్టిస్‌ ఎంజీ ప్రియదర్శిని, వికారాబాద్‌-జస్టిస్‌ సాంబశివరావు నాయుడు, సిరిసిల్ల-జస్టిస్‌ ఏ సంతోష్‌రెడ్డి, వనపర్తి-జస్టిస్‌ డీ. నాగార్జున ను నియమించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement