Thursday, April 25, 2024

లోన్‌యాప్‌ వేధింపులకు మరొకరు బలి

తెలుగు రాష్ట్రాల్లో లోన్‌యాప్‌ వేధింపులకు బలవుతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో మరొకరు బలయ్యారు. మంచిర్యాల జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రుణ గ్రహీత రాజేంద్రప్రసాద్ (35) ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఆయన బంధువులకు పంపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రాజేంద్రప్రసాద్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దండేపల్లి మండలం మామిడిపల్లిలో ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement