Thursday, April 25, 2024

రామచంద్ర భారతిపై మ‌రో కేసు న‌మోదు

తెలంగాణ‌లో సంచ‌ల‌నం రేపిన‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు మరో ఫిర్యాదు అందింది. ఈ మేరకు సిట్ అధికారి ఏసీపీ గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో లాప్ టాప్ లో నకిలీ పాస్ పోర్ట్ దొరికింది. దీనిపై ఆఫీసర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. భరత్ కుమార్ శర్మ పేరుతో, కర్ణాటకలోని పుత్తూరు అడ్రస్ తో పాస్ పోర్ట్ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీపీ గంగాధర్ ఫిర్యాదుతో రామచంద్ర భారతిపై 467, 468, 471 ఐపీసీ 12(3) పాస్ పోర్ట్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement