Thursday, April 18, 2024

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ రాఘవులు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు, రచయిత ముక్కెర రాఘవులు గౌడ్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. గత 32 ఏళ్ల సుదీర్ఘ కాలంలో వారి ప్రస్థానం వివిధ పత్రికల్లో కొనసాగింది. జిల్లాలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన ముక్కెర రాఘవులు గౌడ్ మృతి అందరినీ కలిచివేసింది. వారి మృతిపట్ల ఆంధ్రప్రభ కుటుంబ సభ్యులతో పాటు వివిధ పత్రికలకు చెందిన సీనియర్ రిపోర్టర్, జర్నలిస్టు సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement