Thursday, April 18, 2024

సుభాష్ నగర్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ పోచమ్మ ఆలయం వద్ద అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన అయ్యప్ప మహా పడిపూజా మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…. స్వామి వారి పడిపూజా మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి వారి కృప తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్, నాయకులు అడప శేషు, మహిళా నాయకురాలు పద్మజ రెడ్డి, లక్ష్మణ్, నాని, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement