Thursday, April 25, 2024

మంత్రి హ‌త్య‌కు కుట్ర ఘ‌ట‌న‌పై విచార‌ణ : స‌బితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర‌ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారన్న ఘటనపై విచారణ జరుగుతోందని, త్వ‌ర‌లో దోషులు ఎవ‌ర‌నేది తేలిపోతుంద‌ని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ… అలాంటి ఘటనలను ఎవ్వరూ ప్రోత్సహించరన్నారు. ఇలాంటి వాటిని కచ్చితంగా ఖండించాల్సిందేనన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఘటనపై విపక్షాలు ఆరోపణలు అంటున్నారని, దోషులు ఎవరో పోలీసులు తేల్చుతారని అన్నారు. విచారణలో నిజా నిజాలు బయటపడతాయని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement