Thursday, March 28, 2024

తెలంగాణ బీజేపీ నేత‌ల‌తో ముగిసిన అమిత్ షా స‌మావేశం

తెలంగాణ బీజేపీ నాయ‌కులు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, విజయశాంతి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ నేతల కంటే ముందే… ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో జేపీ నడ్డా, అమిత్ షా చర్చలు జరిపారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్నికల సన్నద్ధతపై చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement