Friday, April 19, 2024

ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం : ఎమ్మెల్యే కేపీ

ప్ర‌తి కాల‌నీలో మెరుగైన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నే ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని షిర్డీ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ, మంచి నీటి పైపు లైన్లు, సీసీ రోడ్లు, పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే స్పందిస్తూ… వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మోహన్ రావు, జెనరల్ సెక్రెటరీ యశస్వి, వైస్ ప్రెసిడెంట్ వీరన్న, ట్రెజరర్ వేణు గోపాల్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement