Thursday, March 28, 2024

పేదలను ఆదుకోవడమే లక్ష్యం- ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): ఆపద సమయంలో పేదలకు అండగా నిలిచేందుకే తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయనిధిని అందిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనో హర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు సీఎం స హాయనిధి ద్వారా మంజూరైన రూ. 43.80 లక్షల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆపదలో ఉన్న సమయంలో వైద్యానికి ఖర్చులు లేని పేదలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు, అనారోగ్యానికి గురైన, వ్యాధుల బారిన పడ్డ పేదల ప్రజలు వైద్యం చేయించుకునే స్థోమత లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందన్నారు. వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్‌ చైర్మన్‌లు, ఏఎంసీ చైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కో- ఆప్షన్‌ సభ్యులు, తెరా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement