Friday, March 29, 2024

Telangana | న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు ప్ర‌వేశ‌పెట్టాలి.. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకు వినతి

న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని కోరుతూ ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు తాళ్లూరి దిలీప్, కొండపల్లి శ్రీనివాసులు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

దిలీప్, శ్రీనివాసులు మొదట ఎంపీ రవిచంద్రను కలిసి న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, రక్షణ చట్టం తీసుకు రావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. దీనిపై ఆయన స్పందించి మంత్రి కిరణ్ రిజుజుతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత ఎంపీతో పాటు న్యాయవాదులు మంత్రి నివాసానికి వెళ్లి వినతిపత్రం అంద‌జేశారు. న్యాయవాదులు చెప్పిన విషయాన్ని మంత్రి కిరణ్ రిజుజు సావధానంగా విని తప్పకుండా పరిశీలిస్తామని హామీనిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement