Thursday, April 25, 2024

మద్దెల తిరుమలకు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం..

బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణానికి చెందిన బిజెపి మహిళా సీనియర్‌ నాయకురాలు మద్దెల తిరుమల సేవారంగంలో చేస్తున్న సేవలను గుర్తించిన గౌతమేశ్వర సాహితి కళా సేవా సంస్థ, ఎస్‌విఆర్‌ స్టూడియో వారు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి బహుబాషా కవి సమ్మేళనములో జాతీయ స్థాయి ఉగాది పురస్కారాన్ని మద్దెల తిరుమలకు అందజేసి సత్కరించారు. ఉగాది పురస్కారం అందుకున్న తిరుమలకు బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జి కొయ్యల ఏమాజీ, రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ బొల్లెడ్ల కేశవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అజ్మీర శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి కోయల్కర్‌ గోవర్దన్‌, మండల అధ్యక్షులు, బిజెపి కౌన్సిలర్‌ అనిత-రాజులాల్‌ యాదవ్‌, పట్టణ నాయకులు శనిగారపు శ్రావణ్‌, కోల అరుణ్‌, సాయికుమార్‌, మండల నాయకులు పొన్నకాయల నాగరాజ, ఆవుల రాజేష్‌లు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement