Thursday, March 28, 2024

పాపం పసివాడు.. ట్రాక్ట‌ర్ ఢీకొని బాలుడు మృతి

ఆదిలాబాద్ : నేరడిగొండ మండల కేంద్రంలోని వడూర్ గ్రామాని వెళ్లే మార్గంలో శనివారం ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో బాలుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దీపక్, అను గుండాలే దంపతుల పెద్ద కుమారుడు ప్రజ్వల్ రాజ్ గుండాలే (12) చిన్న సైకిల్ నడుపుతూ పక్క విధి నుంచి రోడ్డు పైకి వచ్చిన క్రమంలో వడూర్ గ్రామ వైపు నుంచి వస్తున్న డ్రిల్లింగ్ ట్రాక్ట‌ర్ బాలునికి ఢీకొట్టింది. దీంతో బాలుడి తలకు బలమైన దెబ్బ తలగడం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సర్పంచ్ వెంకట రమణ, ఎంపిపి రాథోడ్ సజన్ సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని పొలీస్ స్టేషన్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాహేందర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement