మంచిర్యాలలో గురువారం నాడు విషాదం చోటు చేసుకుంది. రెండేళ్ల పసిపాప 4 అంతస్థుల భవనం పైనుండి కిందపడి చనిపోయింది. మృతురానికి కొండబత్తుల శాన్వికగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవనం నాలుగో అంతస్థు కారిడార్లో ఆడుకుంటున్న శాన్విక ప్రమాదవశాత్తు జారి కిందపడింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ దుర్ఘటన జరిగినప్పుడు పాప తల్లిదండ్రులు ఇంట్లో పనుల్లో నిమగ్నమయ్యారు. తమకు ఉన్న ఒక్క బిడ్డ చనిపోవడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. బాధిత తండ్రి ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్త కూడా చదవండి: బండి సంజయ్ రాసలీలలు బయటపెడుతా: TRS ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్