Saturday, April 20, 2024

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని : 30 మందికి గాయాలు

రెండు ఆర్టీసీ బ‌స్సులు ఢీకొని 30మందికి గాయాలైన ఘ‌ట‌న తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని భైంసా మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ఆర్టీసీ బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. భైంసా నుంచి నిర్మల్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును అదే రోడ్డులో వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రెండు బస్సుల్లో ఉన్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మంది వరకు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు 108 వాహనంలో వారిని భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు మహిళలకు కాళ్లు విరగడంతో వారిని మెరుగైన చికిత్స కోసం నిర్మల్ కు తరలించారు. ఈ ప్రమాద ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement