Wednesday, April 24, 2024

రైలు కింద పడి ఒకరు మృతి..

తాండూరు : మండలం రేపల్లెవాడ సేయింట్‌ థెరిస్సా పాఠశాల సమీపంలో రైలు కింద పడి గుండెల్లి లక్ష్మణ్‌ అనే వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌గౌడ్‌ తెలిపారు. ఆయన ప్రకారం మృతుడు మంచిర్యాల ఎంసీసీ కంపెనీలో వంట మనిషిగా పనిచేస్తున్నాడని, మంగళవారం విధుల నిర్వహించేందుకు అని ఇంటి నుండి వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపినట్లు వెల్లడించారు. రేపల్లెవాడ సమీపంలో పట్టాలు దాటుతుండగా ప్రమాధం చోటు చేసుకుందని లోకో పైలెట్‌ కూడా తెలిపారని హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement