Thursday, April 25, 2024

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోన్న ప్రభుత్వం.. సీఎల్పీ నేత భట్టి

బెల్లంపల్లి, మార్చ్ 31 (ప్రభ న్యూస్) : విద్యారంగాన్ని ప్ర‌భుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సీఎల్పీనేత భ‌ట్టి విక్ర‌మార్క‌ మండిపడ్డారు. శుక్రవారం బెల్లంపల్లి పాదయాత్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలపై వినతి అందజేయడంతో విద్యార్థులతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో విద్యార్థుల కోసం ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ఇచ్చి విద్యార్థుల జీవితంలో వెలుగులు నింపారని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేన‌న్నారు.

ఈ సమస్యపై విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడుతానని, అవసరమైతే సీఎస్ దృష్టికి తీసుకెళ్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. భ‌ట్టి వెంట డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, మంచిర్యాల జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు ఆదర్శ వర్ధన్ రాజు, నియోజకవర్గ నాయకులు శంకర్, నాతరి స్వామి, ఉడిమడుగుల మహేందర్, వేముల కృష్ణ, శారద, కంకటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దొంగల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement