Wednesday, April 24, 2024

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

బెల్లంపల్లి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ అన్నారు. మండలంలోని చాకెపల్లి, పెర్కపల్లి గ్రామాల్లో పిఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల కోసం రైతుబంధు, రైతుభీమా, వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశ పెడుతూ రైతును రాజు చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్‌ చైర్మన్‌ చింతం స్వామి, చాకెపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్‌, ఏఓ ప్రేమ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంబడి సురేష్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement