Saturday, April 20, 2024

శ్రీనిధి రుణాలు ఇప్పించిన వారికి సన్మానం

బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలంలోని మండల సమాఖ్య కార్యాలయంలో బ్యాంకు లింకేజీలో, శ్రీనిధిలో 100 శాతం లోన్లు ఇప్పించిన వారిని సన్మానించడంతో పాటు బహుమతులను అందజేశారు. బ్యాంకు లింకేజీలో మండల టాప్‌లో ప్రజ్ఞ వీవోఏ మాదవి మొదటి స్థానంలో నిలవగా స్వయంకృషి వీవోఏ వెంకటస్వామి రెండవ స్థానంలో నిలిచారు. శ్రీనిధిలో మంజుల మొదటి స్థానంలో నిలవగా, ఆగినపెల్లి శ్రీనివాస్‌ రెండవ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా వారిని ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌ శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి శ్రీనివాస్‌, ఏపిఎం శ్యామల, శ్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్యామల, వీఓఏలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement