Friday, March 29, 2024

ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఎక్కువ మంది ప్రజలు ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్ సిటీ రైలు ద్వారా ప్రయాణిస్తుంటారు. బుధవారం నాడు ఈ రైలుకు ప్రమాదం సంభవించింది. రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో కలకలం రేగింది. అయితే లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తలమడుగు మండలం డోర్లి గేట్ వద్దకు రైలు చేరుకోగానే… రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇంజిన్ ను పొగలు నింపేశాయి. దీంతో వెంటనే రైలును లోకో పైలట్ నిలిపివేశాడు. గంటకు పైగా రైలును డోర్లి గేట్ వద్ద ఆపేశాడు. ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి మరో ఇంజిన్ వచ్చిన తర్వాత, రైలుకు ఇంజిన్ అమర్చి పంపించారు.

ప్రమాదం సంభవించిన వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇంజిన్ లో సాంకేతిక లోపం వచ్చినందువల్లే పొగలు వచ్చాయని చెప్పారు. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఏదేమైనప్పటికీ ప్రయాణికులు మాత్రం మరో రైలు వచ్చేంత వరకు వేచి చూడక తప్పలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement