Wednesday, April 17, 2024

సింగరేణి లాభాల కోసం కృషి..

బెల్లంపల్లి : సింగరేణి కార్మికులు అహర్నిసలు సైనికుల్లా పనిచేస్తూ సింగరేణి సంస్థకు లాభాలను తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకెఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌ అన్నారు. శాంతిఖని గని వద్ద ఏర్పాటు చేసిన గేట్‌ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల ఆరోగ్యం, సంక్షేమ బాధ్యతలు పూర్తిగా యాజమాన్యమే చూసుకునేలా కార్మికులకు ఎలాంటి సమస్యలు రాకుండా తమ దృష్టికి తీసుకువస్తే యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం దాదాపు 100 మంది కార్మికులు టీబీజీకెఎస్‌లో చేరారు. వారికి ఖండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఫిట్‌ సెక్రటరి శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ గెల్లి రాజలింగు, టీబీజీకెఎస్‌ నాయకులు కలాలి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement