Friday, March 29, 2024

సింగరేణి ఉద్యోగులు తప్పనిసరిగా టీకా..

శ్రీరాంపూర్‌: సింగరేణి ఉద్యోగులందరు తప్పసరిగా టీకాలు వేయించుకోవాలని శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం ఎం.సురేష్‌ పేర్కొన్నారు. శ్రీరాంపూర్‌లోని ఆర్కే-8 డిస్పెన్సరిని సందర్శించి డిస్పెన్సరిలో ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు, మెడిసిన్‌ నిల్వలను డిప్యూటీ సీఎంఓ డాక్టర్‌ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులందరిని రక్షించడంలో వైద్య సిబ్బంది నిరంతరం పనిచేస్తూ ఉండాలని సూచించారు. డిస్పెన్సరిలో కరోనా టీకాలను వేసే విధానాన్ని పరిశీలించారు. ఉద్యోగులకు కావాల్సిన మందులను నిల్వ ఉంచుకొని ఎప్పటికప్పుడు కార్మికులకు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ-2 జీఎం కెహెచ్‌ఎన్‌ గుప్త, డీజీఎం పర్సనల్‌ గోవిందరాజు, డిప్యూటీ సీఎంఓ డాక్టర్‌ విజయలక్ష్మి, హెల్త్‌ ఆఫీసర్‌ సుమన్‌, సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మురళీ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement