Friday, March 29, 2024

సమ్మిరెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి విచారం..

బెల్లంపల్లి : జిల్లాలో సీనియర్‌ పాత్రికేయుడు సమ్మిరెడ్డి కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మాజీ మంత్రి గడ్డం వినోద్‌ విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టు కొండ్రు శ్రీనివాస్‌, సీనియర్‌ జర్నలిస్టు సమ్మిరెడ్డిని కరోనా మింగేసిందని, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొందరు రిపోర్టర్‌ మిత్రులు కరోనా భారీన పడ్డారని, నిజాలను ప్రజలకు చూపించేందుకు జర్నలిస్టులు చేసే కృషి చాలా గొప్పదని అన్నారు. మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేసి
తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. సమ్మిరెడ్డి మృతి జర్నలిజానికే తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement