Saturday, April 20, 2024

సమీక్షా సమావేశం..

బెల్లంపల్లి : శాంతిఖని మైన్‌ జనరల్‌ మేనేజర్‌, ఏజెంట్‌లతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకెఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌లు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలో త్రాగునీరు, ఇతర సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని, అలాగే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్లో స్థానికులను 50శాతంకు మించి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ గెల్లి రాజలింగు, ఫిట్‌ సెక్రటరి శ్రీనివాస్‌, టీబీజీకెఎస్‌ నాయకులు కలాలి నర్సయ్య, మురళి, వాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement