Thursday, April 25, 2024

కోదండ రామాలయ అధ్యక్షునిగా రేణికుంట్ల శ్రీనివాస్..

బెల్లంపల్లి : పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం ప్రెసిడెంట్‌గా రేణికుంట్ల శ్రీనివాస్‌ను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో బుగ్గ దేవాలయ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న రేణికుంట్ల శ్రీనివాస్‌కు కోదండ రామాలయం ప్రెసిడెంట్‌గా పదవి రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేణికుంట్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాను దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ప్రతీఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement