Friday, April 19, 2024

తహశీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీఓ..

తాండూరు : బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామలదేవి తాండూరు తహశీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. గ్రీవెన్స్‌లో వచ్చే ధరఖాస్తుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేసుకున్న భూముల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చే ధరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఆమె వెంట ఇంచార్జి తహశిల్దార్‌ మానిక్‌రావు, ఆర్‌ఐ ఎజాజ్‌ ఉద్దిన్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement