Wednesday, April 24, 2024

పాజిటీవ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి..

బెల్లంపల్లి :యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్‌ తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం డాక్టర్‌ ఝాన్సితో మాట్లాడారు. 45 సంవత్సరాలకు పైబడి జరుగుతున్న వ్యాక్సినేషన్‌ గురించి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పాజిటీవ్‌ కేసులు పెరుగుతున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామాల్లో ఏఎన్‌ఎంలతో, ఆశావర్కర్లకు, అక్కడ ఉన్న ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ప్రజల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవాలని కోరారు. వీటిపై వైద్యాధికారి సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట నాయకులు బావన్లపల్లి భరత్‌, బోగ శ్రావణ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement