Wednesday, April 24, 2024

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన డీఎల్పీఓ..

కాసిపేట :మండలం ముత్యంపెల్లి పంచాతి కేంద్రంలో డీఎల్పీఓ ఫణీందర్‌ పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పల్లె ప్రగతి పురోగతి పనులు పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పరిసరాల పరిశుభ్రత, కరోనా నేపద్యంలో చేపట్టిన పనులను పర్యవేక్షించారు. గ్రామస్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డ్‌లను తనిఖి చేశారు. డీఎల్పీఓ వెంట సర్పంచ్‌ ఆడే బాదు, ఉప సర్పంచ్‌ బోయిని తిరుపతి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement